త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం!

ABN , First Publish Date - 2021-07-10T17:02:40+05:30 IST

త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ కోసం...

త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం!

అగర్తల: త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ కోసం పశ్చిమ బెంగాల్‌కు పంపించిన 152 శాంపిళ్లలో 90కిపైగా శాంపిళ్లు పాజిటివ్‌గా గుర్తించారు. ఈ కేసులన్నీ డాల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించినవని వైద్యులు నిర్ధారణ చేశారు. దీంతో కరోనా థర్డ్ వేవ్‌కు ఇది సూచికగా నిపుణులు భావిస్తున్నారు. 


ఈ సందర్భంగా త్రిపురలోని కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ దీప్ దేవ్ మాట్లాడుతూ త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం 151 శాంపిళ్లు పంపగా వాటిలో 90కిపైగా శాంపిళ్లు డెల్డా వేరియంట్ పాజిటివ్ అని గుర్తించారన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనికిముందు కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో సార్స్-కోవ్-2 కరోనా వైరస్ ఆందోళనకరంగా మారిందని ప్రకటించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-07-10T17:02:40+05:30 IST