భార్య వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన భర్త.. ఆమె గురించి షాకింగ్ విషయం తెలిసి..
ABN , First Publish Date - 2022-03-04T22:15:53+05:30 IST
అతనికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది.. అప్పట్నుంచి అతనికి భార్య నుంచి వేధింపులు మొదలయ్యాయి..
అతనికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది.. అప్పట్నుంచి అతనికి భార్య నుంచి వేధింపులు మొదలయ్యాయి.. ఆస్తులను తన పేరు మీదకు బదిలీ చేయాల్సిందిగా భర్తను ఆమె ఒత్తిడి చేయడం ప్రారంభించింది.. అలా చేయకపోతే గృహ హింస కేసు పెడతానని బెదిరించింది.. ఆ క్రమంలో అతడికి మరో షాకింగ్ విషయం తెలిసింది.. చివరకు అతను పోలీసులను ఆశ్రయించి తన భార్యపై ఫిర్యాదు చేశాడు.
రాజస్థాన్లోని శ్రీగంగాపూర్కు సమీపంలోని సూరత్గఢ్కు చెందిన విజయ్కు 2019లో పూనమ్ అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల వరకు అంతా బాగానే సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. పూనమ్, ఆమె తల్లి విజయ్ను వేధించడం ప్రారంభించారు. ఇంటిని తన పేరు మీద రాయల్సిందిగా విజయ్ను పూనమ్ ఒత్తిడి చేసింది. లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగింది. దీంతో పూనమ్ గత చరిత్ర గురించి విజయ్ ఆరా తీశాడు.
అప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆమెకు 2006లోనే వివాహం జరిగిన విషయం అతనికి తెలిసింది. మొదటి వివాహం గురించి దాచి పెట్టి తనను రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకుని విజయ్ షాకయ్యాడు. వెంటనే సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.