భార్య పెడుతున్న టార్చర్ భరించలేక ఎలుకల మందు తినేసిన భర్త.. అసలు కథేంటని అడిగితే అతడి తల్లి చెప్పిన నిజాలివి..!
ABN , First Publish Date - 2022-06-10T22:32:43+05:30 IST
ఆ అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు..
ఆ అన్నదమ్ములిద్దరూ ఆరేళ్ల క్రితం ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు.. అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. తమ్ముడికి మాత్రం పిల్లలు లేరు.. కొద్ది కాలం వరకు వీరి సంసారాలు బాగానే సాగాయి.. ఆ తర్వాత ఆ అక్కాచెల్లెళ్ల బండారం బయటపడింది.. తమ మేనమామ ఇద్దరు కొడుకులతో ఆ అక్కాచెల్లెళ్లు గతంలోనే ప్రేమాయణాలు నడిపారు.. వివాహం తర్వాత కూడా ఆ బంధాలను కొనసాగించారు.. ఈ విషయం బయటపడడంతో అసలు గొడవ మొదలైంది.. భార్య తీరు మనస్థాపం కలిగించడంతో అన్నయ్య ఎలుకల మందు తాగేశాడు.. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి..
కొత్త కోడలిని ఇంట్లోనే ఉంచి మార్కెట్కు వెళ్లిన అత్త, మరిది.. తిరిగి వచ్చేసరికి గదిలో కనిపించిన దృశ్యం చూసి..
రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన లోకేష్ అనే వ్యక్తి బబితను, యోగేష్ అనే వ్యక్తి సంగీతను 2016లో వివాహం చేసుకున్నారు. లోకేష్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. యోగేష్కు మాత్రం పిల్లలు పుట్టలేదు. రెండేళ్ల క్రితం బబిత, సంగీతల మేనమామ మరణించాడు. దాంతో ఆయన కొడుకులు తరచుగా బబిత, సంగీతల ఇంటికి రావడం ప్రారంభించారు. దీంతో లోకేష్, యోగేష్కు అనుమానం మొదలైంది. విచారించగా తమ భార్యలకు ఆ ఇద్దరు యువకులతో లవ్ అఫైర్లు ఉన్నట్టు తెలిసింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇద్దరూ ఆ బంధాలను కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈ విషయమై రెండు జంటల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
గురువారం బబిత, లోకేష్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో బబిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లోకేష్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీవ్ర మనస్థాపానికి గురైన లోకేష్ స్టేషన్లోనే ఎలుకల మందు తాగేసి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. తన కోడళ్లు ఇద్దరూ తమను వేధిస్తున్నారని, తమకున్న ఒక్క ఇల్లూ అమ్మేసి ఆ డబ్బులతో పుట్టింటికి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారని లోకేష్ తల్లి చెబుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.