టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2021-04-23T04:32:49+05:30 IST

అలంపూరు మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
లక్ష్మీదేవికి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కరుణాకర్‌

    అలంపూర్‌, ఏప్రిల్‌ 22 : అలంపూరు మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను లక్ష్మీదేవి బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కరుణాకర్‌ గురువారం ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జి.రాజు, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, చైర్‌పర్సన్‌ మనోరమ వెంకటేష్‌, కౌన్సిలర్లు సుదర్శన్‌ గౌడ్‌, ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, ధర్మకర్త వెంకటరామయ్య శెట్టి, నాయకులు ఎరుకలి సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T04:32:49+05:30 IST