టీఆర్‌ఎస్‌కు ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-17T00:45:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ

టీఆర్‌ఎస్‌కు ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తే అనేక మంది రైతులు వారి గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ కూడా ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని ప్రజాప్రతినిధులే మాట్లాడడం సరికాదని, సీఎం కేసీఆర్‌కు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని హెచ్చరించారు. పప్పుదినుసులు, నూనె గింజల సేకరణ ఇంతవరకు జరుగలేదని  జీవన్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-10-17T00:45:13+05:30 IST