TRS ధర్నా.. ఫెక్సీలకు ఎంత పెనాల్టీ వేశారంటే..!

ABN , First Publish Date - 2021-11-13T14:41:21+05:30 IST

రైతులకు సంఘీభావంగా శుక్రవారం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ధర్నా..

TRS ధర్నా.. ఫెక్సీలకు ఎంత పెనాల్టీ వేశారంటే..!

హైదరాబాద్‌ సిటీ : రైతులకు సంఘీభావంగా శుక్రవారం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ధర్నా నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పలువురికి జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగం జరిమానా విధించింది. ధర్నాచౌక్‌ వద్ద ముఖ్యమంత్రి, ఇతర నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.10 వేలు జరిమానా వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలకు రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున పెనాల్టీ విధించారు. ఫ్లెక్సీల ఫొటోలను నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంలో ఈవీడీఎం చర్యలకు శ్రీకారం చుట్టింది.

Updated Date - 2021-11-13T14:41:21+05:30 IST