ఎన్నికల హామీలను విస్మరించిన టీఆర్ఎస్
ABN , First Publish Date - 2022-10-01T03:24:20+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్రావు అన్నారు. శుక్ర వారం వేంపల్లిలో బీజేపీ అసెంబ్లీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసమర్ధ ఎమ్మెల్యే వల్ల మంచిర్యాల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, నియోజకవర్గంలోని ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు
హాజీపూర్, సెప్టెంబరు 30: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్రావు అన్నారు. శుక్ర వారం వేంపల్లిలో బీజేపీ అసెంబ్లీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసమర్ధ ఎమ్మెల్యే వల్ల మంచిర్యాల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, నియోజకవర్గంలోని ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేద న్నారు. బీజేపీ నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరమణ, నాయకులు రంగారావు, వెంకటేశ్వర్గౌడ్, రజనీష్జైన్, శ్రీధర్, రమేష్, ప్రభాకర్, శ్రీదేవి, వెంకటేశ్వర్రావు, పాల్గొన్నారు.