స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం
ABN , First Publish Date - 2021-12-14T15:10:04+05:30 IST
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురైంది.
ఖమ్మం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురైంది. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్నే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.