టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్న రమణ

ABN , First Publish Date - 2021-07-12T20:06:32+05:30 IST

టీడీపీ-టీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.

టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్న రమణ

హైదరాబాద్: టీడీపీ-టీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయన.. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 16న కేసీఆర్‌ సమక్షంలో రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.   


Updated Date - 2021-07-12T20:06:32+05:30 IST