మా ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-07-27T16:49:03+05:30 IST

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌పై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మా ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు: కేటీఆర్

హైదరాబాద్: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్(TRS) ఎంపీల(MPs) సస్సెన్షన్‌పై మంత్రి కేటీఆర్‌(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నిత్యావసరాలపై జీఎస్టీ (GST) పెంపుపై చర్చకు అంగీకరింకాకుండా కేంద్ర ప్రభుత్వం మా ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుండి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2022-07-27T16:49:03+05:30 IST