వైద్యాధికారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-09T16:01:57+05:30 IST

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు...

వైద్యాధికారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం

హైదరాబాద్/అల్లాపూర్‌ : అల్లాపూర్‌ డివిజన్‌ పర్వత్‌ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి వైద్యాధికారి ఉదయం 10 దాటినా విధులకు హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పర్వత్‌ నగర్‌లోని పీహెచ్‌సీని ఎమ్మెల్యే సందర్శించారు. ఆస్పత్రిలో సదుపాయలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మరింత మెరుగైన సదుపాయాలను,  వైద్య సేవలను అందించాలని సూచించారు. వ్యాక్సిన్‌ను మరింత ఎక్కువ మందికి అందించేలా చర్యలు తీసుకోవలని ఎమ్మెల్యే ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఉదయం 10 గంటలకు మొదలు పెట్టడం వృద్ధులకు ఇబ్బందిగా ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచే టీకాలివ్వడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేతోపాటు ఎండీ గౌసుద్దీన్‌, మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-09T16:01:57+05:30 IST