చూస్తూ ఊరుకోం: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-16T22:57:10+05:30 IST

రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యేషాలు రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని

చూస్తూ ఊరుకోం: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యేషాలు రెచ్చగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని బీజేపీని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. బెంగాల్ వాతావరణాన్ని తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీయే టీఆర్ఎస్‌పై దాడి చేసి దొంగే దొంగ అన్నట్లు ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం కొనకపోతే రైతులు ఉరికిచ్చి కొడతారని ఆయన పేర్కొన్నారు. మోదీ, కేంద్ర మంత్రుల ముందు  బీజేపీ నేతలు ధర్నాలు చేస్తే బాగుంటుందని  జీవన్‌రెడ్డి హితవు పలికారు. 


Updated Date - 2021-11-16T22:57:10+05:30 IST