బీజేపీది రాజకీయ దివాళాకోరుతనం: Kadiyam srihari
ABN , First Publish Date - 2022-01-10T19:13:27+05:30 IST
వరంగల్లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
హైదరాబాద్: వరంగల్లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీది రాజకీయ దివాళాకోరుతనమని మండిపడ్డారు. మేడారానికి జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నేతలు అని వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ను విమర్శించే అర్హత బండి సంజయ్కి లేదన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే తెలంగాణపై బీజేపీ దాడి చేస్తోందని కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు.