MLC Kavita: ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర

ABN , First Publish Date - 2022-09-07T19:51:17+05:30 IST

బీజేపీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavita: ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర

నిజామాబాద్: బీజేపీ (BJP)పై ఎమ్మెల్సీ కవిత (Kavita)తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఇక్కడ ఇస్తున్నట్లు ఇతర రాష్ట్రాల్లో పెన్షన్లు ఎందుకివ్వలేరని ప్రశ్నించారు. కేసీఆర్ (CM KCR) అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉచితాలను తీసేసేందుకు కేంద్రం (Central government) కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మోదీ (PM Modi) రూ.10లక్షల కోట్లు తన మిత్రులకు పంచిపెట్టారన్నారు. ఆర్థికమంత్రి రేషన్ షాపులకు వెళ్లి మోదీ ఫొటోపై కలెక్టర్‌తో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. ప్రధాని ఫొటోలు రేషన్ షాపుల్లో పెడతారా అని నిలదీశారు. బీజేపీ సర్కార్‌ (BJP Government)కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కవిత హెచ్చరించారు. 


Updated Date - 2022-09-07T19:51:17+05:30 IST