అంతిమ యాత్రకూ జీఎస్టీ కట్టాల్సిన దుస్థితి

ABN , First Publish Date - 2022-08-03T09:52:55+05:30 IST

మనిషి అంతిమయాత్ర కోసం కూడా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు.

అంతిమ యాత్రకూ జీఎస్టీ కట్టాల్సిన దుస్థితి

రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మనిషి అంతిమయాత్ర కోసం కూడా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు. దేశంలో ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంపై సెస్‌ విధిస్తున్న కేంద్రప్రభుత్వం ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తోందని బీజేపీ చెప్తున్న ఈ తరుణంలోనూ ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని, కేంద్రం మాత్రం తెలంగాణకు రావాల్సిన రుణాల్లో కోత విధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  

Updated Date - 2022-08-03T09:52:55+05:30 IST