గ్యాస్ బండకు దండం పెట్టు..
ABN , First Publish Date - 2021-10-26T05:08:39+05:30 IST
గ్యాస్ బండకు దండం పెట్టు..
టీఆర్ఎస్ శ్రేణుల వినూత్న ప్రచారం
కమలాపూర్, అక్టోబరు 25 : కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘గ్యాస్ బండకు దండం పెట్టు.. బీజేపీని బొందపెట్టు’ అనే నినాదాలతో కూడిన డమ్మీ గ్యాస్ సిలిండర్లను తయారు చేసి వాటితో వినూత్న ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ హయాంలో పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. గ్యాస్ సిలిండర్కు దండం పెట్టాలని, ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టాలని ప్రజలకు ప్రచారంలో సూచించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. కాగా, ప్రచారంలో పలువురు మహిళలు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టారు. అనంతరం వాటిని ద్విచక్ర వాహనాలపై కట్టుకొని గ్రామ వీధుల్లో పర్యటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఒస్కుల డెవిడ్, మాట్ల సురేందర్, మాట్ల యాదగిరి, పుల్ల పున్నంచందర్, వేల్పుల ఆనందం, మాట్ల శ్రీపాల్, పుల్ల శ్రీనివాస్, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.