ప్లీన‌రీలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు

ABN , First Publish Date - 2021-10-25T21:38:13+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్లీన‌రీలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు

హైద‌రాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చుతున్నార‌ని ప్రశంసించారు. రైతుబంధు, ద‌ళిత బంధు ప‌థ‌కాలు చ‌రిత్రలో నిలిచిపోతాయ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విద‌శాబ్ది వేడుక‌ల్లో టీఆర్ఎస్ ఎన్నారై  ప్రతినిధులు పాల్గొనున్నట్లు మ‌హేశ్ బిగాల తెలిపారు. అలాగే ఎన్నారైల‌కు మొట్టమెదటి సారి కేసీఆర్ త‌ర‌పున అధ్యక్ష ఎన్నిక‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పించిన పార్టీకి కృత‌జ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-25T21:38:13+05:30 IST