TS News: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టీఆర్ఎస్ ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-07-30T15:31:36+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో వెలసిన శ్రీసీతారామచంద్రమూర్తిని పలువురు టీఆర్ఎస్ ప్రతినిధులు శనివారం ఉదయం దర్శించుకున్నారు.

TS News: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టీఆర్ఎస్ ప్రతినిధులు

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో వెలసిన శ్రీసీతారామచంద్రమూర్తిని పలువురు టీఆర్ఎస్ ప్రతినిధులు (TRS representatives ) శనివారం ఉదయం దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి (Bandi parthasaradi), వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju ravichandra), ఎంపీ నామ నాగేశ్వరరావు (Nama Nageshwar rao), ఎమ్మెల్సీ  తాత మధు (Thata Madhu), ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Rega Kantha rao),  ఎమ్మెల్యే రాములు నాయక్‌(Ramulu naik)లతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు (TRS Leaders) భద్రాద్రి రామయ్యను సేవలో తరలించారు. ఆలయం వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఆలయ ఈవో శివాజీ (Shivaji) ఘన స్వాగతం పలికి పూలమాలలతో ఆహ్వానించారు. అనంతరం అర్చకులు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో టీఆర్ఎస్ ప్రతినిధులకు వేద పండితులు  వేదాశీర్వచనం అందించారు.  

Updated Date - 2022-07-30T15:31:36+05:30 IST