సాగర్లో బీజేపీకి టీఆర్ఎస్ షాక్
ABN , First Publish Date - 2021-03-30T22:41:01+05:30 IST
ఉప ఎన్నకలలో పోటీ చేసే తమ అభ్యర్థిగా రవి నాయక్ను బీజేపీ ప్రకటించడంతో సాగర్లో బీజేపీకి టీఆర్ఎస్ షాక్
నాగార్జున సాగర్: ఉప ఎన్నికలలో పోటీ చేసే తమ అభ్యర్థిగా రవి నాయక్ను బీజేపీ ప్రకటించడంతో సాగర్లో బీజేపీకి టీఆర్ఎస్ షాక్ ఇవ్వనుంది. టికెట్ రాని బీజేపీ అసంతృప్తులకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. మరి కాసేపట్లో టీఆర్ఎస్లో బీజేపీ నేతలు నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్ చేరనున్నారు. నివేదితారెడ్డి ఇప్పటికే సాగర్లో అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నివేదితారెడ్డి భర్త శ్రీధర్రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ నివేదితారెడ్డి పోటీ చేశారు.
అయితే ఈ ఉప ఎన్నికలలో తనకు టికెట్ రాకపోవడంతో నివేదితారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో టీఆర్ఎస్లో చేరేందుకు నివేదితారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ఫామ్హౌస్కు నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్ చేరుకుని సీఎం కేసీఆర్ను కలువనున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.