అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-03-01T03:48:16+05:30 IST

రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను టీఆర్‌ఎస్‌ పార్టీ మోసం చేసిందని టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బీ.రాములు అ న్నారు.

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌
మాట్లాడుతున్న బీ.రాములు

 టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బీ.రాములు

వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి28: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను టీఆర్‌ఎస్‌ పార్టీ  మోసం చేసిందని  టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బీ.రాములు అ న్నారు.  జిల్లా కేంద్రంలోని టీడీపీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి నందిమళ్ల శారద నివా సంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. గతంలో గెలిచిన రాంచందర్‌రావు, నాగేశ్వర్‌  ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలపై ఏ ఒక్కరోజు పెద్దలసభలో గొం తు వినిపించింది లేదన్నారు. ఓడిపోతామని తెలిసి టీఆర్‌ఎస్‌ తరఫున పీవీ కూతురిని ఎ మ్మెల్సీ ఎన్నికల బరితో దింపిందన్నారు. నమ్మిన  సిద్ధాంతాల కోసం టీడీపీలో ఉన్న ఎల్‌.ర మణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. అంతకు ముందు నందిమళ్ల అశోక్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులను, పట్టభద్రులను ఇంటింటికి వెళ్లి ఎ న్నికల ప్రచారం నిర్వహించారు.  కౌన్సిలర్‌ లక్ష్మి, ఏర్పుల రవియాదవ్‌, వాకిటి నారాయణ, వహీద్‌, బాలరాజు, బాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T03:48:16+05:30 IST