బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద TRS వర్సెస్ BJP
ABN , First Publish Date - 2022-05-26T16:44:04+05:30 IST
నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల రాకతో టెన్షన్ నెలకొంది.
హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల రాకతో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూర్కు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:35 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బీజేపీ నేతులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాగా బేగంపేట ఎయిర్పోర్టుకు కేసీఆర్ రాక సంధర్భంగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు బేగంపేట్కు చేరుకుంటున్నారు.