truck hits bus: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-09-03T16:20:50+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(road accident) నలుగురు మరణించగా,మరో 12మంది గాయపడ్డారు...

truck hits bus: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురి మృతి

12మందికి గాయాలు

బారాబంకీ(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(road accident) నలుగురు మరణించగా,మరో 12మంది గాయపడ్డారు. వలస కార్మికులతో(migrant workers) వస్తున్న డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బస్సు ప్రయాణికులు మరణించారు. మరో 12 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.బారాబంకీ(Barabanki) పట్టణ సమీపంలోని మహాంగుపూర్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాలీ వలస కార్మికులను గోవాకు డబుల్ డెక్కర్ బస్సులో తీసుకువెళుతుండగా బస్సు టైరుకు పంక్చర్ అయింది. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి టైరు మారుస్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు(speeding truck hit) నిలిపిఉంచిన బస్సును ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2022-09-03T16:20:50+05:30 IST