ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T06:10:15+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులపై 36 నెలల పాటు ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల

ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నంలో సీపీఎం నాయకుల నిరసన

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 10: విద్యుత్‌ వినియోగదారులపై 36 నెలల పాటు ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని సీపీఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్‌ చేశారు.  ట్రూ అప్‌ చార్టీలకు వ్యతిరేకంగా రింగ్‌ సెంటర్‌ గాంధీ బొమ్మ వద్ద బుధవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేసిన దానికి నిరసనలు వ్యక్తం అవటంతో బిల్లులో సర్దుబాటు చేశారని అన్నారు. ఈ సారి అలా కాకుండా అత్యధిక జిల్లాలో యూనిట్‌కు 0.22పైసలు చొప్పున ఆగస్టు నుంచి రాబోయే మూడు సంవత్సరాలు వసూలు చేయబోతు న్నారన్నారు.  పి.వి.ఆంజనేయులు, ఎన్‌.సి.హెచ్‌.శ్రీనివాస్‌, ఎం. మహేష్‌, ఎ.విఠల్‌రావు, విజయ్‌, నవీన్‌, శ్రీను, రాజేశ్వరీ  పాల్గొన్నారు



Updated Date - 2022-08-11T06:10:15+05:30 IST