ఇలా చేసి చూడండి!
ABN , First Publish Date - 2021-03-04T05:49:36+05:30 IST
మందారపూలను తైలంగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది
- మందారపూలను తైలంగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది.
- గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుని, కొద్దిగా వేడిచేసిన కొబ్బరినూనెతో ముఖాన్ని సున్నితంగా మర్దన చేయాలి. అలాగే రాత్రంతా ఉండి పొద్దున్న చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా తయారవుతుంది.
- లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది.
- వేసవిలో నీళ్లల్లో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
- ముఖంపై మొటిమలు ఉన్నవాళ్లు పెరుగులో కొద్దిగా సెనగపిండి వేసి పేస్టులా కలిపి దాన్ని ముఖానికి రాస్తే మొటిమలు పోతాయి.
- పల్లీలు, బెల్లం కలిపి తింటే చర్మం తాజాగా ఉండడమే కాదు చర్మంపై ఉన్న మచ్చలు కూడా పోతాయి.
- మెంతుల్ని మెత్తటి పొడిలా చేసి స్క్రబ్ లేదా మాస్కులా వాడొచ్చు. ఇలా రోజూ చేస్తే చర్మంలోని మృతకణాలు పోతాయి. బ్లాక్హెడ్స్, జిడ్డుతనం కూడా పోతాయి. నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి గుజ్జుగా చేసి అందులో సెనగపిండి, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుంటే కళ్ల కింద ఉండే నల్లని వలయాలు పోతాయి.