సీఎస్... రూ.10వేలు చెల్లించండి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-23T02:06:19+05:30 IST

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టులో

సీఎస్... రూ.10వేలు చెల్లించండి: హైకోర్టు

హైదరాబాద్‌: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జీవో 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయనందుకు సీఎస్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా హాజరు మినహాయింపు కోసం పిటిషన్ కూడా వేయలేదని సీఎస్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.10వేలు చెల్లించాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు సీజే ధర్మాసనం ఆదేశించింది. పీఎం కొవిడ్ సహాయ నిధికి రూ.10వేలను చెల్లించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. జనవరి 24న విచారణకు హాజరు కావాలని సోమేష్ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-12-23T02:06:19+05:30 IST