ఇంటర్‌ పరీక్షలో తొలిరోజు 320 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2021-10-26T04:51:09+05:30 IST

ఇంటర్‌ పరీక్షలో తొలిరోజు 320 మంది గైర్హాజరు

ఇంటర్‌ పరీక్షలో తొలిరోజు 320 మంది గైర్హాజరు

ములుగు, అక్టోబరు 25: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. మొత్తం  10 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటిర రోజు తెలుగు, హిందీ పరీక్షలు జరిగాయి.  2,051 మంది విద్యార్థులకు గానూ తొలిరోజు 1,731 మంది మాత్రమే హాజరయ్యారు.  320మంది గైర్హాజ రైనట్లు ఇంటర్‌ పరీక్షల జిల్లా నోడల్‌ అధికారి వెంకన్న తెలిపారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాత విద్యార్థులను లోపలికి అనుమతిం చారు. సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్య వేక్షించాయి. పోలీ సులు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2021-10-26T04:51:09+05:30 IST