TS News: భావోద్వేగానికి లోనైన మంత్రి..
ABN , First Publish Date - 2022-09-20T03:37:16+05:30 IST
మహబూబాబాద్ : మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు రిజర్వేషన్, గిరిజన బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కేసీఆర్ (KCR) నిర్ణయం చారిత్రా
మహబూబాబాద్ : మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు రిజర్వేషన్, గిరిజన బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కేసీఆర్ (KCR) నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ మంత్రి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటన్నింటిని అధిగమించానని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు.