TS News: 12 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
ABN , First Publish Date - 2022-09-10T23:42:14+05:30 IST
Hyderabad: బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన మూడు ధపాలుగా పాదయాత్ర చేపట్టిని విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాయి. మొత్తం 11 రోజుల పాటు.. 110కి.మీ. మేర పాదయాత్ర సాగుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజ
Hyderabad: బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన మూడు ధపాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాయి. మొత్తం 11 రోజుల పాటు.. 110కి.మీ. మేర పాదయాత్ర సాగుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. పెద్ద అంబర్పేట్లో 22వ తేదీన ముగింపు సభ నిర్వహించనున్నారు.