TS News: తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రమే నిర్వహిస్తుంది: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-03T21:56:19+05:30 IST

హనుమకొండ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆత్మలు ఘోషించేలా చేస్తోందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 17న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో తెలంగాణ వి

TS News: తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రమే నిర్వహిస్తుంది: కిషన్ రెడ్డి

హనుమకొండ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆత్మలు ఘోషించేలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 17న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.


‘‘ఎంఐఎంకు భయపడే...’’

‘కేంద్ర బలగాలతో పరేడ్, తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నా తెలంగాణలో నిర్వహించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో విమోచన వేడుకలకు అమిత్ షా హాజరవుతారు. ఇవాళ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు పంపాను. ఎంఐఎం (MIM) పార్టీకి భయపడే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించడం లేదు. ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతుంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T21:56:19+05:30 IST