TS News: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొన్నాల లక్ష్ముయ్య బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-09-17T03:52:39+05:30 IST

Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల (Ponnala) లక్ష్ముయ్య బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌కు ఈ మధ్య దళితులపైన ఎక్కడలేని ప్రేమ, గౌరవం ఒక్కసారిగా పెరిగాయని పేర్కొన్నారు. హఠాత్తుగా సచివాలయం భ

TS News: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొన్నాల లక్ష్ముయ్య బహిరంగ లేఖ

Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల (Ponnala) లక్ష్ముయ్య బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌కు ఈ మధ్య దళితులపైన ఎక్కడలేని ప్రేమ, గౌరవం ఒక్కసారిగా పెరిగాయని పేర్కొన్నారు. హఠాత్తుగా సచివాలయం భవనానికి అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం.. దళిత ఓట్లను ఆకర్షించేందుకేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. దళితనేత రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి  ఎందుకు బర్తరఫ్ చేశారో ఇంతవరకు చెప్పలేదని తెలిపారు. రాష్ట్రంలో భూమిలేని కుటుంబాలు 10లక్షలకుపైగా ఉన్నారని, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా వాటిలో 18 శాతం దళిత రైతులే ఉన్నారని, 8 ఏళ్ల కాలంలో దళితుల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-17T03:52:39+05:30 IST