TS News: అందుకోసమే గిరిజన బంధు: ఉత్తమ్
ABN , First Publish Date - 2022-09-18T23:26:14+05:30 IST
Hyderabad: సీఎం కేసీఆర్ (CM KCR) గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడం రాజకీయ లబ్ధి కోసమేనని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బంజారా ఆది
Hyderabad: సీఎం కేసీఆర్ (CM KCR) గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడం రాజకీయ లబ్ధి కోసమేనని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బంజారా ఆదివాసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు. గిరిజనులపై 10 శాతం రిజర్వేషన్లు, అలాగే దళిత బంధులాగానే గిరిజన బంధు పథకం తెస్తామని సీఎం చెప్పడంపై ఉత్తమ్ స్పందించారు. కేసీఆర్ హామీలు వట్టి బూటకమని పేర్కొన్నారు. ఎస్టీ కోటాపై 2014లో ఎందుకు జీవో జారీ చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’ పెడుతున్నారని విమర్శించారు.