అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ అంగీకారం
ABN , First Publish Date - 2021-06-21T00:02:18+05:30 IST
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ అంగీకారం
హైదరాబాద్: తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్డౌన్ నేటి నుంచి ఎత్తివేతతో అంతర్ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి. ఏపీలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఏపీలో తెలంగాణ బస్సులు నడవనున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 వరకు కర్ణాటకలోకి టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రవేశించనున్నాయి.