గుండెపోటుతో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి మృతి
ABN , First Publish Date - 2022-09-27T08:50:10+05:30 IST
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి పెద్ద కుమారుడు అభిజిత్(23) గుండెపోటుతో చనిపోయారు.
మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ఈటల సంతాపం
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి పెద్ద కుమారుడు అభిజిత్(23) గుండెపోటుతో చనిపోయారు. ఆదివారం రాత్రి నిద్రలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అభిజిత్ గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు ఆదివారం రాత్రే తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అభిజిత్ అంత్యక్రియలను నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు అభిజిత్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్కు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే సుమారు రూ.50 లక్షల ప్యాకేజీతో ఓ ఆయిల్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు వచ్చే నెల ఆయన దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, ఇంతలోనే ఇలా జరిగింది.