TSNews: వర్సిటీకి రెగ్యులర్ వీసీ నియమించాలి ..సీపీఐ నేత నారాయణ
ABN , First Publish Date - 2022-08-01T00:25:23+05:30 IST
Delhi: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీపీఐ సీనియర్ నేత నారాయణ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్సిటీకి రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు
Delhi: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan)కు సీపీఐ (CPI) సీనియర్ నేత నారాయణ (Narayana) లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)విద్యార్థులపై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్సిటీకి రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని, హాస్టల్ నిర్వహణ వర్సిటీ చేతుల్లోనే ఉండాలని కోరారు. దీన్నే విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.