Tsrtcలో ‘మండే చాలెంజ్’
ABN , First Publish Date - 2022-06-27T13:57:47+05:30 IST
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. టీఎ్సఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రవేశపెట్టిన
హైదరాబాద్ సిటీ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. టీఎ్సఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీలో ‘మండే చాలెంజ్’ పేరుతో సోమవారం రికార్డుస్థాయిలో ఆదా యం తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్జోన్లో 29 డిపోల్లో రూ.5.5 - రూ.6 కోట్ల ఆదాయం లక్ష్యంగా డిపోల వారీగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. సోమవారం రద్దీకి తగినట్లు బస్సుల ట్రిప్పులు పెంచడం, అర్ధరాత్రి వరకు బస్సులు నడుపుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నెలరోజులుగా గ్రేటర్జోన్ ఆదాయం రూ.4.5-5.2 కోట్ల వరకు పెరిగింది. రూ.5కోట్లకు ఆదాయం తగ్గకుండా గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.