300 దర్శన టికెట్లపై అనాసక్తి

ABN , First Publish Date - 2021-04-23T10:47:59+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల చేసి మూడురోజులవుతున్నా ఒక్కరోజుకు సంబంధించిన కోటా కూడా పూర్తి కాలేదు. వైరస్‌ బారిన పడకుండా

300 దర్శన టికెట్లపై అనాసక్తి

తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల చేసి మూడురోజులవుతున్నా ఒక్కరోజుకు సంబంధించిన కోటా కూడా పూర్తి కాలేదు.  వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే కొద్దిరోజులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరమని భక్తులు భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


ఇందులో భాగంగానే మే నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను ఏప్రిల్‌ 20వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసినా భక్తులు బుకింగ్‌ విషయంలో ఆసక్తి చూపడం లేదు. మరోవైపు గదుల కోటా కూడా ఖాళీగానే ఉంది. కాగా, ‘గడప గడపకు గోజెండా’ పేరుతో ఏప్రిల్‌ 22 నుంచి మే 6 వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించిన పతాకాలను టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి-గోసేవ ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌ తిరుమలలో గురువారం ఆవిష్కరించారు.

Updated Date - 2021-04-23T10:47:59+05:30 IST