కామాక్షితాయి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడి దంపతులు

ABN , First Publish Date - 2022-06-29T04:25:28+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడు పచ్చిపాల సనత్‌కుమార్‌రెడ్డి దంపతులు మంగళవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు.

కామాక్షితాయి సన్నిధిలో టీటీడీ బోర్డు సభ్యుడి దంపతులు
టీటీడీ బోర్డు సభ్యుడి దంపతులకు ప్రసాదాలను అందజేస్తున్న అర్చకులు

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌28: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడు పచ్చిపాల సనత్‌కుమార్‌రెడ్డి దంపతులు మంగళవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. తొలుత అర్చకులు వారికి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్రనామాలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని స్వామి, అమ్మవార్ల శేషవస్ర్తాలతో సత్కరించారు.

Updated Date - 2022-06-29T04:25:28+05:30 IST