AP News: సీఎం జగన్ను కలిసిన టీటీడీ చైర్మన్
ABN , First Publish Date - 2022-09-21T17:05:13+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కలిశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) కలిశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ (AP CM)ను కలిసిన టీటీడీ చైర్మన్ (TTD Chairman)... స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను సీఎం (CM Jagan)కు అందజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి (AV Dharma reddy), తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి (Bhumama karunakar reddy) సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.