ఆన్లైన్లో టీటీడీ దర్శనం టికెట్లు విడుదల
ABN , First Publish Date - 2021-10-22T20:57:02+05:30 IST
శ్రీవారిని భక్తులు దర్శంచుకోవడానికి వీలుగా దర్శనం టికెట్లను ఆన్లైన్లో
తిరుమల: శ్రీవారిని భక్తులు దర్శంచుకోవడానికి వీలుగా దర్శనం టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. నాలుగు గంటల్లోనే ఆన్లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్లైన్ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది.