శారదా పీఠాధిపతికి TTD ఈవో ఆహ్వానం
ABN , First Publish Date - 2022-05-16T00:31:55+05:30 IST
భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి
తిరుమల: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీవేకంటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. తిరుమల గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి ఆదివారం ఈవో వెళ్లి.. వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని వివరించారు.