బాధిత కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-18T05:26:23+05:30 IST

అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో చనిపోయిన, గాయపడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందని సీపీఐ, సీపీఎం నాయకులు పి.మహేష్‌, సి.రవికుమార్‌, శివరామకృష్ణ దేవర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ సంఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్‌ను వారు పరామర్శించారు.

బాధిత కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి
రాజంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంటయ్యను పరామర్శిస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు

సీపీఐ, సీపీఎం నాయకుల డిమాండ్‌ 

రాజంపేట, మే 17: అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో చనిపోయిన, గాయపడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉందని సీపీఐ, సీపీఎం నాయకులు పి.మహేష్‌, సి.రవికుమార్‌, శివరామకృష్ణ దేవర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ సంఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్‌ను వారు పరామర్శించారు. ఈ దుర్గటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. చనిపోయిన కత్తి యల్లయ్య కుటుంబీకులతో మాట్లాడారు. యల్లయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాలు విరిగిన చంటయ్య కుటుంబానికి రెండు లక్షలు ఎక్స్‌గ్రేసియా అందజేసి ఖర్చులు టీటీడీనే భరించాలన్నారు. 


రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : 

రైల్వేకోడూరు, మే 17: అన్నమయ్య ఉత్సవాల్లోని మృతుడికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి ఒక రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌, వ్యవసాయ కార్మిక నాయకుడు సిగె చిన్నయ్య, కేవీపీఎస్‌ డివిజన్‌ కన్వీనర్‌ ఓబలి పెంచలయ్యలు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఈ సంఘటనపై టీడీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-05-18T05:26:23+05:30 IST