Ttd: అన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు

ABN , First Publish Date - 2022-07-30T03:02:40+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా

Ttd: అన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ టికెట్లను విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తారు. ఒక్కో టికెట్‌కు రూ.2,500 చెల్లించి భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులూ స్నపన తిరుమంజనంలో, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది.

Updated Date - 2022-07-30T03:02:40+05:30 IST