35 నిమిషాల్లోనే దొంగలను పట్టేశారు!
ABN , First Publish Date - 2022-03-07T13:40:21+05:30 IST
తిరుమలలో భక్తుల నగదు, సెల్ఫోన్లు ఉన్న బ్యాగును చోరీ చేసిన ఇద్దరు దొంగలను టీటీడీ
తిరుమల : తిరుమలలో భక్తుల నగదు, సెల్ఫోన్లు ఉన్న బ్యాగును చోరీ చేసిన ఇద్దరు దొంగలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన మురుగన్, ముస్సేన్ బేగ్ తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు పొంది.. ఆదివారం ఉదయం తిరుమలకు వచ్చారు. వీరు దర్శనానికి వెళ్లకుండా కొండపై రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భక్తుల బ్యాగును కాజేశారు. అందులో మూడు సెల్ఫోన్లు, రూ.15,330 నగదు ఉన్నాయి. బ్యాగుపోయిన విషయాన్ని గుర్తించిన భక్తులు స్థానిక విజిలెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 35 నిమిషాల్లోనే తిరుపతి డౌన్ టోల్గేట్ వద్ద నిందితులను పట్టుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం టూటౌన్ పోలీసులకు అప్పగించారు.