Shashikalaను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చేయడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-04-22T18:34:59+05:30 IST
అన్నాడీఎంకేకు శశికళను ప్రధానకార్యదర్శిగా చేస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. మదురైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
- టీటీవీ దినకరన్
పెరంబూర్(చెన్నై): అన్నాడీఎంకేకు శశికళను ప్రధానకార్యదర్శిగా చేస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. మదురైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందన్నారు. జయలలిత ఇష్టపడి వెళ్లే కొడనాడులో జరిగిన హత్యకేసులో నిజమైన నిందితులను అరెస్టు చేస్తారని పోలీసు శాఖ, రాష్ట్రప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడం గుర్రపు పందేల వంటిది కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీని కాపాడుకుంటామని, శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కార్యకర్తల అభీష్టమని దినకరన్ తెలిపారు.