పాపం! సీఎం జగన్ (cm jagan)కు పీకుడు జబ్బు వచ్చినట్లుంది: Tulasi reddy
ABN , First Publish Date - 2022-06-28T20:23:07+05:30 IST
కాంగ్రెస్ నేత తులసి రెడ్డి సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి (Amaravathi): పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ తులసి రెడ్డి (Tulasi reddy) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy)పై విమర్శలు చేశారు. ‘‘పాపం! ముఖ్యమంత్రి గారికి పీకుడు జబ్బు వచ్చినట్లుంది.. ఇటీవలి కాలంలో నా వెంట్రుక ఎవ్వరూ పీకలేరని పదేపదే అంటున్నారు. ఆయన వెంట్రుక పీకేటంత తీరిక, ఓపిక, అవసరం ప్రతిపక్ష పార్టీలకు లేదు. కానీ ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ప్రజలు ఆయన పదవీ పీకక తప్పదు. పదవీ పోయిన తర్వాత ఆయన వెంట్రుకలు ఆయనే పీక్కొక తప్పదు.’’ అని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
అలాగే వైసీపీ పాలనా తీరుపై తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.13 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా రూ.54 వేలు లాక్కోవడం భావ్యమా? అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తేనే అమ్మ ఒడి పథకం సద్వినియోగం అవుతుందన్నారు. విద్యారంగంలోని పాత పథకాలనే కొత్త పేర్లతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు ఇంగ్లీష్పై అభిమానం.. తెలుగు పట్ల ద్వేషం ఎందుకు అని తులసిరెడ్డి ప్రశ్నించారు.