ఇది సీఎం జగన్ కుసంస్కారానికి నిదర్శనం: తులసి రెడ్డి

ABN , First Publish Date - 2022-03-09T18:00:58+05:30 IST

దివంగత రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులర్పించక పోవడం...

ఇది సీఎం జగన్ కుసంస్కారానికి నిదర్శనం: తులసి రెడ్డి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులర్పించక పోవడం గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి జగన్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. రోశయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్సీగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారన్నారు. 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిన గొప్ప ఆర్థిక వేత్తని కొనియాడారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి సంతాప తీర్మానం పెట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-09T18:00:58+05:30 IST