సొంత చెల్లెళ్ళకు న్యాయం చేయలేని సీఎం.. రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తారా?: తులసి రెడ్డి

ABN , First Publish Date - 2022-03-09T18:32:45+05:30 IST

మహిళా సాధికారిత పట్ల వైసీపీ నాయకులు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి అన్నారు.

సొంత చెల్లెళ్ళకు న్యాయం చేయలేని సీఎం.. రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తారా?: తులసి రెడ్డి

అమరావతి: మహిళా సాధికారిత పట్ల వైసీపీ నాయకులు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర మహిళలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారిత పట్ల చిత్త శుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలన్నారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదన్నారు. జగనన్న తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా తయారయిందన్నారు. అంగన్‌వాడి, ఆషా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పెళ్ళికానుక పథకాన్ని అమలు చేయాలని, బంగారు తల్లి, అమ్మహస్తం పథకాలను పునరుద్ధరించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-09T18:32:45+05:30 IST