గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-07-27T04:25:15+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని, దళితబంధును ఇక్కడా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు.
దళితబంధును గజ్వేల్లోనూ అమలు చేయాలి
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, జూలై 26: ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని, దళితబంధును ఇక్కడా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ పట్టణంలో దళితులకు రూ.30 లక్షలతో నూతన కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని హామీఇచ్చి మరిచారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కాలనీల్లో ఇళ్లలో గోడలు కూలుతున్నా ఒక్క అధికారి కూడా పరిశీలించలేదని వాపోయారు. ప్రజ్ఞాపూర్లో బస్టాండ్ కట్టివ్వలేదని, గజ్వేల్లోని బస్టాండ్ను కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. గజ్వేల్ రింగ్రోడ్డును ఏడు సంవత్సరాలైనా పూర్తిచేయడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని నర్సారెడ్డి సవాల్ విసిరారు.