తుంగభద్ర ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-08-28T13:37:24+05:30 IST
తుంగభద్ర ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది...
కర్నూలు: తుంగభద్ర ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 67,128 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 79,595 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 105 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 103 టీఎంసీలుగా ఉంది.