చిక్కుడు తోటకు నిప్పు
ABN , First Publish Date - 2022-05-26T05:50:39+05:30 IST
చేతికి అందివచ్చిన చిక్కుడు పంటకు వైసీపీ నాయకుడు నిప్పంటించారని, తద్వారా తనకు రూ.3.50 లక్షల పంటనష్టం వాటిల్లిందని మండలం లోని తుంగపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత, రైతు ఈదర సీతారామయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నాయకుడి దాష్టీకం
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
రొంపిచర్ల, మే 25 : చేతికి అందివచ్చిన చిక్కుడు పంటకు వైసీపీ నాయకుడు నిప్పంటించారని, తద్వారా తనకు రూ.3.50 లక్షల పంటనష్టం వాటిల్లిందని మండలం లోని తుంగపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత, రైతు ఈదర సీతారామయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై సీతారామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. తుంగపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఏనుగంటి వెంకటరావు మంగళవారం సాయంత్రం తన చిక్కుడు తోటకు నిప్పంటించాడనీ, తద్వారా తనకు సుమారు సుమారు రూ.3.50 లక్షల పంట నష్టం వాటిల్లిందని అని సీతారామయ్య పేర్కొన్నాడు. ఈ ఘటన పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారెవరూ స్పందించ లేదని ఆరోపించాడు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ తుంగపాడు గ్రామంలో వైసీపీ నాయకులు తమ ఆగడాలు ఆపకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.